Share News

ఇక వెళ్లొస్తాం.. సరేనా..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:59 PM

పిల్లలతో స్వస్థలాలకు పయనంచిలమత్తూరు, జూలై 16: వలస పక్షులు తిరుగుబాట పట్టాయి. ఎంతో ఇష్టమైన అతిథులుగా చెప్పుకునే సైబీరియన వలస పక్షులు వారం రోజులుగా వీరాపురం గ్రామం నుంచి తమ స్వస్థలాలకు పయనమవుతున్నాయి.

ఇక వెళ్లొస్తాం.. సరేనా..!

ఫ వలస పక్షుల తిరుగు ప్రయాణం ఫ పిల్లలతో స్వస్థలాలకు పయనంచిలమత్తూరు, జూలై 16: వలస పక్షులు తిరుగుబాట పట్టాయి. ఎంతో ఇష్టమైన అతిథులుగా చెప్పుకునే సైబీరియన వలస పక్షులు వారం రోజులుగా వీరాపురం గ్రామం నుంచి తమ స్వస్థలాలకు పయనమవుతున్నాయి. సంతానోత్పత్తికై జనవరి నెల ప్రారంభంలో విడిదికి వచ్చిన ఈ ఎర్రకాళ్ల కొంగలు తమ సంతతిని వృద్ధి చేసుకొని వీరాపురం, వెంకటాపురం గ్రామాలను వదిలి స్వస్థలాలకు తరలిపోతున్నాయి. ప్రధానంగా సంతానోత్పత్తికోసమే విడిదికి వస్తున్న ఈ పక్షులు ఆరు నెలల వ్యవధిలో గుడ్లు పెట్టి, పిల్లలను పెంచి, పోషించి వాటికి ఎగరగలిగే శక్తి రాగానే సైబీరియనకి పయనమవుతాయి. ఇప్పటికే కొన్ని వలస వెళ్లడంతో పక్షులు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తున్నాయి.

Updated Date - Jul 16 , 2024 | 11:59 PM