Share News

SAVITA : సవిత నామినేషనకు భారీగా తరలిన నాయకులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:02 AM

పెనుకొండ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేనివిధంగా టీడీపీ అభ్యర్థి సవిత నామినేషనకు బు ధవారం భారీగా జనం తరలి వచ్చారు. పెనుకొండ నియోజకవర్గం ఐదు మండ లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఆటోలు, బస్సులు, వ్యాన్లలో భారీ ఎ త్తున పెనుకొండకు చేరుకున్నారు.

SAVITA : సవిత నామినేషనకు భారీగా తరలిన నాయకులు
Leaders and activists of various villages moving for Savita nomination in Penukonda

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 24: పెనుకొండ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేనివిధంగా టీడీపీ అభ్యర్థి సవిత నామినేషనకు బు ధవారం భారీగా జనం తరలి వచ్చారు. పెనుకొండ నియోజకవర్గం ఐదు మండ లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఆటోలు, బస్సులు, వ్యాన్లలో భారీ ఎ త్తున పెనుకొండకు చేరుకున్నారు. సవిత నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో పెనుకొండ వీధులన్నీ టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసి పోయాయిు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.


హిందూపురం అర్బన: తెలుగుదేశం పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత బుధవారం నామినేషన వేశారు. ఈ కార్యక్రమానికి పరిగి మండల వ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలివెళ్లారు. ఉదయం 8 గంటల నుంచే ప్రత్యేక వాహనాల్లో, బస్సుల్లో వేలాదిగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు రెట్టింపు ఉత్సాహంతో నామినేషన ప్రక్రియకు తరలారు.


రొద్దం: పెనుకొండలో జరిగే టీడీపీ కూటమి అభ్యర్థి సవిత నామినేషన కార్యక్రమానికి టీడీపీ మండల నాయకులు తరలివెళ్లారు. రొద్దం నుంచి అన్ని గ్రామాల టీడీపీ కార్యకర్తలు, నాయకులు బుధవారం వాహనాల్లో పెద్దఎత్తున తరలివెళ్లారు. తరలి వెళ్లిన వారిలో చిన్నప్పయ్య, జీవీపీ నాయుడు, మాధవనాయుడు, నరసింహులు, సుబ్బరత్నమ్మ, నరహరి, చంద్ర మౌళి, టైలర్‌ ఆంజనేయులు, నాగేంద్ర, సర్పంచ మంజు, నాగరాజు తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:02 AM