mla kandikunta ఉద్యోగుల సంతోషమే కూటమి ధ్యేయం: కందికుంట
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:11 AM
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, వారు సంతోషంగా ఉండేలా చేయడమే కూట మి ప్రభుత్వ ధేయ్యమని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
![mla kandikunta ఉద్యోగుల సంతోషమే కూటమి ధ్యేయం: కందికుంట](https://media.andhrajyothy.com/media/2024/20240604/9_KDRUR_01_aeba96a29b.jpg)
కదిరిఅర్బన, జూన 9: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, వారు సంతోషంగా ఉండేలా చేయడమే కూట మి ప్రభుత్వ ధేయ్యమని ఎ మ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
కదిరి ఆర్టీసీ డిపోమేనేజర్ మైనొద్దీన, అసిస్టెంట్ మేనేజర్లు హ రి, రామ్మోహన, కార్మిక సం ఘం నాయకులు ఆదివారం కందికుంటను ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వివరించారు. ఇందుకు కందికుంట స్పందిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులు ఆనందంగా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...