Share News

RAIDS : గోరంట్లలో కర్ణాటక పోలీసుల దాడులు

ABN , Publish Date - May 19 , 2024 | 11:44 PM

పట్టణంలోని ప్రధాన రహదారిపై స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం కర్ణాటక పోలీసులు ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో, ఎర్రరంగుకారులో వచ్చిన కర్ణాటక పోలీసులు గోరంట్లలోని బ్యాంక్‌ వద్ద నెంబర్‌ ప్లేట్లు లేని ఆటో, డియో స్కూటీని దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

RAIDS : గోరంట్లలో కర్ణాటక పోలీసుల దాడులు
Karnataka police arresting the auto

ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఆటో, బైక్‌ స్వాధీనం

గోరంట్ల, మే 19: పట్టణంలోని ప్రధాన రహదారిపై స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం కర్ణాటక పోలీసులు ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో, ఎర్రరంగుకారులో వచ్చిన కర్ణాటక పోలీసులు గోరంట్లలోని బ్యాంక్‌ వద్ద నెంబర్‌ ప్లేట్లు లేని ఆటో, డియో స్కూటీని దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


జనసంచారం అధికంగా ఉన్నప్రాంతంలో పోలీసులు దాడిచేసి పట్టుకోవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. కర్ణాటక పోలీసుల వెంట స్థానిక పోలీసులు లేరు. దాడి తరువాత కూడా వారు స్థానిక పోలీస్‌ స్టేషనలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలి సింది. కర్ణాటకలో చోరీ అయిన ఆటో, స్కూటీని వెంబడిస్తూ వచ్చారని, వాటిని పట్టుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈవిషయంపై గోరంట్ల పోలీసులను విచారించగా, తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 11:44 PM