Share News

కందికుంట ముమ్మర ప్రచారం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:08 AM

కదిరి, ఏప్రిల్‌ 6: తలుపుల మండలంలోని పెన్నబండవాండ్లపల్లి, గుడాలగొంది, ఓబీఆర్‌తండా, ఓబీఆర్‌ కొత్తపల్లి, పులిగొండ్లవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు.

 కందికుంట ముమ్మర ప్రచారం

కదిరి, ఏప్రిల్‌ 6: తలుపుల మండలంలోని పెన్నబండవాండ్లపల్లి, గుడాలగొంది, ఓబీఆర్‌తండా, ఓబీఆర్‌ కొత్తపల్లి, పులిగొండ్లవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా సూపర్‌సిక్స్‌ పథకాల గురించి తెలియజేశారు. ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ మహిళలు ఆయనకు హారతుల్చి ఘనస్వాగతం పలికారు. యువత గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అఽఽధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:08 AM