Share News

tdp: గిరిజన తండాల్లో కందికుంట ప్రచారం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:01 AM

తనకల్లు, ఏప్రిల్‌ 24: మండల పరిధిలోని గేమేనాయక్‌ తండా పంచాయతీలోని అద్దానంపల్లి, రథినేనాయక్‌తాండా, కమటంపల్లి, బుడ్డయ్యకోట, తులసేనాయక్‌ తండా, నాయనచెరువుపల్లి, మూటిచింతమాను తండా, పోమేనాయక్‌ తండా, గద్దలబండ తండా, వేపలపల్లి గ్రామాలతోపాటు త వళం గ్రామ పంచాయతీలోని వివిధ గ్రామాల్లో బుధవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు.

 tdp: గిరిజన తండాల్లో కందికుంట ప్రచారం

తనకల్లు, ఏప్రిల్‌ 24: మండల పరిధిలోని గేమేనాయక్‌ తండా పంచాయతీలోని అద్దానంపల్లి, రథినేనాయక్‌తాండా, కమటంపల్లి, బుడ్డయ్యకోట, తులసేనాయక్‌ తండా, నాయనచెరువుపల్లి, మూటిచింతమాను తండా, పోమేనాయక్‌ తండా, గద్దలబండ తండా, వేపలపల్లి గ్రామాలతోపాటు త వళం గ్రామ పంచాయతీలోని వివిధ గ్రామాల్లో బుధవారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించా రు.


గిరిజన తండాలలో కందికుంటకు గిరిజనులు అపూ ర్వ స్వాగతం పలికారు. కందికుంట ఇంటింటా తిరిగి సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. చంద్రబాబు సీఎం అవగానే వా టిని అమలు చేస్తారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. గిరిజన కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది వైసీపీనేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ తొట్లి రెడ్డి శేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బీగం శంకర్‌నాయుడు, ఈశ్వర్‌రెడ్డి, రాజారెడ్డి, గేమేనాయక్‌ తండా సర్పంచ కాంతమ్మ, జనసేన నాయకులు రమణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 25 , 2024 | 01:01 AM