Share News

కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:16 AM

నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.

కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా
రోడ్‌షోలో ప్రజలకు విక్టరీ గుర్తు చూపుతున్న అమిలినేని సురేంద్రబాబు

కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 18: నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం కుందుర్పి మండల ఎస్‌ మల్లాపురం, మల్లాపురం తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలలతో అమిలినేనికి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. బీటీపీ కాలువను పూర్తి చేసి కుందుర్పి బ్రాంచ కెనాల్‌ ద్వారా ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. వలసలను పూర్తిగా నివారించి కళ్యాణదుర్గం ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. మే 13న ప్రతి ఒక్కరు ఓటును వేసి టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రచారంలో అమిలినేని కుటుంబ సభ్యులు

కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామంలో అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులుఎన్నికల ప్రచారాన్ని గురువారం చేపట్టారు. సురేంద్రబాబు కోడలు ఇషిత ఇంటింటికి తిరుగుతూ సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరు గెలుపునకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:16 AM