Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:37 AM

కదిరి, ఫిబ్రవరి 12: పట్టణంలోని 34 వార్డులో గల వీవర్సుకాలనీ నుంచి దాదాపు 50కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో సోమవారం వారు టీడీపీలోకి చేరారు.

 వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

కదిరి, ఫిబ్రవరి 12: పట్టణంలోని 34 వార్డులో గల వీవర్సుకాలనీ నుంచి దాదాపు 50కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో సోమవారం వారు టీడీపీలోకి చేరారు. కందికుంట వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో నరసింహులు, వెంకటరమణ, వెంకటేష్‌, ఆదినారాయణ, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తలుపుల మండలం చదలవాండ్లపల్లి గ్రామంలో 20కుటుంబాల వారు కడప వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరినీ కూడా కందికుంట వెంకటప్రసాద్‌ కండువాలు క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Feb 13 , 2024 | 12:37 AM