Share News

జగనన్న ఆరోగ్య సురక్షకు స్పందన కరువు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:16 AM

కొత్తచెరువు,ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. వీటికి ప్రజల నుంచి స్పందన కరువైంది. మండ ల కేంద్రంలోని గ్రా మ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని వైద్యాధికారులు, సిబ్బంది నిర్వహించారు.

జగనన్న ఆరోగ్య సురక్షకు స్పందన కరువు

కొత్తచెరువు,ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. వీటికి ప్రజల నుంచి స్పందన కరువైంది. మండ ల కేంద్రంలోని గ్రా మ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని వైద్యాధికారులు, సిబ్బంది నిర్వహించారు. అయితే ఇందులో పారాసిటమల్‌తో పాటు ఒకటి అర జబ్బులకు సంబంధించిన మం దులను మాత్రమే అందిస్తున్నారు. ఇతర జబ్బులకు సంబంధించిన మందులు అందించకపోవడంతో జనం రావడం లేదు. ఈ శిబిరంలో రోగుల కంటే వైద్యసిబ్బందే అధికంగా కనిపించారు. రోగులు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరంలో ప్రభుత్వం 70 రకాల జబ్బులకు మందులను అందిస్తున్నామని గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రెండు లేదా మూడు రకాల మందులకు మాత్రమే మందులు అందుబాటులో ఉంచారు. మందులు లేని వైద్యశిబిరాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారని సిబ్బందిని ప్రజలు ప్రశ్నించినట్టు సమాచారం.

Updated Date - Feb 17 , 2024 | 12:16 AM