Share News

నిరుద్యోగులను మోసం చేసిన జగన

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:28 AM

అధికారంలోకి వస్తే ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ ఇస్తామని చెప్పిన జగన నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడని ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి కొట్రేష్‌ పేర్కొన్నారు.

నిరుద్యోగులను మోసం చేసిన జగన

రాయదుర్గంరూరల్‌, జనవరి 7: అధికారంలోకి వస్తే ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ ఇస్తామని చెప్పిన జగన నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడని ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి కొట్రేష్‌ పేర్కొన్నారు. పట్టణంలో నిరుద్యోగులతో కలిసి జగన ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఆదివారం ఆటో తోలుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొట్రేష్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులుగా ఓటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. టీచర్‌ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాయదుర్గం లక్ష్మీబజార్‌లో ఆటో నడుపుతూ నిరుద్యోగుల సమస్యలలను ప్రభుత్వానికి తెలిసేలా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ తాలూకా కార్యవర్గ సభ్యుడు మురడి యోగేంద్ర, నాయకులు తరుణ్‌, తేజ, వంశీ రహంతుల్లా, యల్లప్ప, మధు, ప్రేమ్‌ చెన్నకేశవ, అంజి పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:28 AM