Share News

దళిత ద్రోహులకు ఆశ్రయమిస్తున్న జగన

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:13 AM

దళితులను అవమానించే వారికే సీ ఎం జగనమోహన రెడ్డి ఆశ్రయం ఇ స్తున్నారని, దళిత ద్రోహి జగన అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు.

దళిత ద్రోహులకు ఆశ్రయమిస్తున్న జగన
విలేకరులతో మాట్లాడుతున్న సునీల్‌కుమార్‌

ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

మడకశిరటౌన, ఏప్రిల్‌ 17: దళితులను అవమానించే వారికే సీ ఎం జగనమోహన రెడ్డి ఆశ్రయం ఇ స్తున్నారని, దళిత ద్రోహి జగన అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు. ఆయన బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాటా ్లడారు. దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులును కోర్టు దోషిగా తేల్చినా జగన వేనుక వేసుకొని రావడం చూస్తే.. దళితుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అర్థమవుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని, అయినా ముఖ్యమంత్రి వాటి ని ఏమాత్రం ఖండించకపోవడం బాధాకరం అన్నారు. కేజీబీవీ, మోడల్‌స్కూల్‌, ఎస్సీ, ఎస్టీ బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా మారిందన్నారు. వారికి నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం లేదన్నారు. దళితుల భూములకు రక్షణ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల ఎకరాల దళితుల భూములను లాక్కొన్నారని ఆరోపిం చారు. దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్న జగనకు త్వరలో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని సునీల్‌ ప్రజలను కోరారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

నేడు రొళ్లలో ఎన్నికల ప్రచారం

రొళ్ల: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మండలంలోని వన్నారనహళ్లి లో గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని టీడీపీ రాష్ట్ర వక్కలిగ సాధికార కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌ తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రచారం చేస్తారని, దొడ్డేరిలో ముగుస్తుందని వారు తెలిపారు. వారు బుధవారం విలేకరులకు తెలిపారు. టీ డీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Apr 18 , 2024 | 12:13 AM