Share News

పరీక్ష కేంద్రాల పరిశీలన

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:58 PM

పట్టణంలోని పలు పాఠశాలలను 10వతరతి, ఓపెన ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ కోసం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ శుక్రవారం పరిశీలించారు.

పరీక్ష కేంద్రాల పరిశీలన

గోరంట్ల, జనవరి 5: పట్టణంలోని పలు పాఠశాలలను 10వతరతి, ఓపెన ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ కోసం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ లాజర్‌ శుక్రవారం పరిశీలించారు. పది, ఓపెన ఇంటర్‌ పరీక్షాకేంద్రల నిర్వహణ, సౌకర్యాల పరిశీలన కోసం ఆయన పాఠశాలలను తనిఖీ చేశారు. బాలుర ఉన్నత పాఠశాలలో గదులు, మరుగుదొడ్లను పరిశీలించి, ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌తో చర్చించారు. అలాగే బాలికల ఉన్నత, ఉర్దూ పాఠశాలలు, శ్రీవివేకానంద, న్యూమాంటీసోరీ, శ్రీచైతన్య ప్రైవేటు పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఎస్‌ఏపీఎస్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో ఓపెన ఇంటర్‌ పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈకేంద్రంలో చిలమత్తూరు మండలం సోమగట్ట విద్యార్థులు పరీక్షలు రాసేవారు. తమకు సెంటర్‌ మార్చాలంటూ స్థానికులు అభ్యర్థించడంతో దీనిపై ప్రిన్సిపల్‌ సూర్యనారాయణతో ఆయన చర్చించారు.

Updated Date - Jan 05 , 2024 | 11:58 PM