Share News

రైల్‌ కోచ హోటల్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:33 AM

స్థానిక రైల్వే స్టేషన వద్ద ప్రయోగాత్మకంగా రైల్‌ కోచ హోటల్‌ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు.

 రైల్‌ కోచ హోటల్‌ ప్రారంభం

గుంతకల్లు, ఏప్రిల్‌5: స్థానిక రైల్వే స్టేషన వద్ద ప్రయోగాత్మకంగా రైల్‌ కోచ హోటల్‌ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి డీఆర్‌ఎం వినీత సింగ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాత రైలు బోగీని రైల్వే స్టేషన బయట ఓపెన ఆడిటోరియం పార్కు వద్ద ఏర్పాటు చేసి, దాన్ని సంవత్సర కాలానికి రూ. 21 లక్షల లీజ్‌కు ఇచ్చారు. సంబంధిత కాంట్రాక్టరు ఆ రైలు బోగీని తన సొంత ఖర్చుతో ఏసీ హోటల్‌గా తీర్చిదిద్దాడు. ఈ హోటల్‌ను రైల్వే స్టేషనకు, పార్కుకు వచ్చే వారు లక్ష్యంగా ఏర్పాటు చేశారు. సీనియర్‌ డీసీఎం మనోజ్‌, సీనియర్‌ డీఈఎన కో-ఆర్డినేషన అక్కిరెడ్డి, ఏఈఎన రామస్వామి నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:33 AM