Share News

YOGA : ఇండో-నేపాల్‌ యోగాలో... జిల్లా యువకుడికి ప్రథమస్థానం

ABN , Publish Date - May 27 , 2024 | 11:56 PM

ఇండోనేపాల్‌ యోగా చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా యువకుడికి ప్రథమస్థానం దక్కింది. హిమాలయ అకాడమీ, ఇండియన యూత స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో నేపాల్‌లోని ఖాట్మాండ్‌లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు యోగా పోటీలు నిర్వహించారు.

YOGA : ఇండో-నేపాల్‌ యోగాలో...   జిల్లా యువకుడికి ప్రథమస్థానం
Navina in Vijayanandam

హిందూపురం అర్బన, మే 27: ఇండోనేపాల్‌ యోగా చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా యువకుడికి ప్రథమస్థానం దక్కింది. హిమాలయ అకాడమీ, ఇండియన యూత స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో నేపాల్‌లోని ఖాట్మాండ్‌లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు యోగా పోటీలు నిర్వహించారు. ఇందులో పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన సి నవీనకుమార్‌ ప్రతిభ కనబరచి ప్రఽథమ స్థానంలో నిలిచాడు. ఇండియా తరుఫున పోటీల్లో పాల్గొని విజయం సాధించినందుకు నవీనను శ్రీరంగరాజుపల్లి వాసులు అభినందిం చారు. తల్లితండ్రులు, గురువు పీడీ ఆదినారాయణ సంతోషం వ్యక్తం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 27 , 2024 | 11:56 PM