Share News

టీడీపీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పింఛన

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:15 AM

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే యాభై ఏళ్లకే పింఛన వస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పింఛన
ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు

రోడ్‌షోలో అమిలినేని

కుందుర్పి, ఏప్రిల్‌ 17: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే యాభై ఏళ్లకే పింఛన వస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండల పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేనికి ఆ పార్టీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ గత ఎన్నికల ముందు జగన్మోహనరెడ్డి బీసీలకు 45 యేళ్లకే పింఛన ఇస్తామని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మరిచిపోయాడన్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 50 యేళ్లకే అది కూడా రూ.4 వేలు ఇంటిదగ్గరికే ఇస్తారని, ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:15 AM