Share News

ప్రకాశరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:19 AM

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్దాలే చెబుతాడని కూటమి రాప్తా డు ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత విమర్శిం చారు. ఆమె బుధవారం రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలోని ఏడు గుర్రాలపల్లి, కురుకుండ్లకాలనీ, సీకొత్తపల్లి, పెదయ్యగారికొట్టాల, దుబ్బార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రకాశరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే
ప్రచారంలో మాట్లాడుతున్న సునీత

రామగిరి : రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్దాలే చెబుతాడని కూటమి రాప్తా డు ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత విమర్శిం చారు. ఆమె బుధవారం రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీలోని ఏడు గుర్రాలపల్లి, కురుకుండ్లకాలనీ, సీకొత్తపల్లి, పెదయ్యగారికొట్టాల, దుబ్బార్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేరూరు డ్యాంకు నీరు తెచ్చామని, బంగారు గనులు తెరిపించామని అబద్దాలు చెబుతున్న ఎమ్మెల్యేకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నా రు. ఈ ఐదేళ్లలో ప్రకాశరెడ్డి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు గుర్తించాలన్నారు. కాగా, పరిటాల సునీత కోడలు పరిటాల జ్ఞాన అనంతపురంరూరల్‌ మండలంలోని పాపంపేటలోని రంగారెడ్డి కాలనీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.


నేడు నామినేషన

రాప్తాడు : రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం పరిటాల సునీత నామినేషన వేయను న్నారని పరిటాల సిద్దార్ధ తెలిపారు. నామినేషన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు అవస రమైన సభా స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలిం చారు. నామినేషన కార్యక్రమానికి వచ్చిన అందరికీ భోజనం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, మరూరు టోల్‌ ప్లాజా నుంచి రాప్తాడు తహ సీల్దార్‌ కార్యాలయం వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తు న్నట్లు మండల ఇనచార్జ్‌ మురళి తెలిపారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 12:20 AM