Share News

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:06 AM

పుట్టపర్తి రూరల్‌, మార్చి 11: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు డాక్టర్‌ జ్యోత్స్న పేర్కొన్నారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

పుట్టపర్తి రూరల్‌, మార్చి 11: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు డాక్టర్‌ జ్యోత్స్న పేర్కొన్నారు. ఈమేరకు ఆరోగ్యకేంద్రం పరిధిలోని మండలప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆమె పౌష్టికాహారం, అయోడిన ఉప్పు వాడకంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే పౌష్టికాహారంతో పాటు అయోడిన ఉప్పును క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. అయోడిన లోపం ఉంటే బుద్ధిమాంధ్యం కలుగుతుందని, అధికబరువుకు, జుట్టురాలడం, ఋతుచక్రం దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. కనుక ప్రతిఒక్కరూ శరీరంలో అయోడిన తగ్గకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచఓ నగేష్‌, పీహెచఎన లలితకుమారి, ఎంపీపీ స్కూల్‌ హెచఎం సునీత, సూపర్‌వైజర్‌ చంద్రకళ, ఉపాధ్యాయిలు, ఆరోగ్య, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 01:06 AM