యర్రాయపల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:34 AM
బత్తలపలి,్ల జనవరి 27: మండలంలోని యర్రాయపల్లి గ్రామంలో శనివారం టీడీపీ శ్రేణులు బాబుష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![యర్రాయపల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బత్తలపలి,్ల జనవరి 27: మండలంలోని యర్రాయపల్లి గ్రామంలో శనివారం టీడీపీ శ్రేణులు బాబుష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ టీడీపీ మినీమేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షుడు చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. వైసీపీ పాలనంతా అరాచకాలు, అక్రమాలతో సాగిందన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్నాయుడు, వెంకటేశ్వర్లు, రామలింగప్ప, జయరాం, నూతనప్రసాద్, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.