Share News

ఘనంగా నారసింహుడి ఉత్సవాలు

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:46 PM

మండలంలోని న్యామద్దల ఎస్సీ కాలనీలో లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా నారసింహుడి ఉత్సవాలు
స్వామివారి పంజు సేవకు తరలివచ్చిన భక్తులుస్వామివారి పంజు సేవకు తరలివచ్చిన భక్తులు

చెన్నేకొత్తపల్లి, మార్చి 26: మండలంలోని న్యామద్దల ఎస్సీ కాలనీలో లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కదిరి పౌర్ణమిని పురష్కరించుకుని రెండు రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. గ్రామ సమీపంలోని కొండ నుంచి స్వామివారిని మంగళవారం ఉదయం ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పంజు సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి తిలకించారు. ఆలయ ఆవరణంలో పెద్ద ఎత్తున దాసంగం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామస్థులతో పాటు బెంగుళూరు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Updated Date - Mar 26 , 2024 | 11:46 PM