రైతును ముంచిన ప్రభుత్వం: సీపీఎం
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:36 PM
వైసీపీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని సీపీఎం నాయకులు విమర్శించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు.
![రైతును ముంచిన ప్రభుత్వం: సీపీఎం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉరవకొండ,జనవరి1: వైసీపీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని సీపీఎం నాయకులు విమర్శించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రైతు సమస్యలపై ధర్నా నిర్వహించారు. మోకాళ్లపైన నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ రైతులకు బీమా, పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, పంటవేయని రైతులకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలన్నారు. హంద్రీనీవా ద్వారా హెచ్చెల్సీ, జీబీసీ ఆయకట్టు పంట పూర్తయ్యే వరకూ సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధుసూదన, రంగారెడ్డి, మురళి, శ్రీనప్ప, వినోద్ కుమార్, వెంకటేశులు పాల్గొన్నారు.