వైభవంగా గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తిరునాళ్ల
ABN , Publish Date - Feb 25 , 2024 | 11:12 PM
మండలంలోని కోటంక సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ల ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్రనామార్చన, మంత్ర పుష్పకం, ఏకవారురుద్రభిషేకం, ఆకుపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు
గార్లదిన్నె, ఫిబ్రవరి 25: మండలంలోని కోటంక సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ల ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్రనామార్చన, మంత్ర పుష్పకం, ఏకవారురుద్రభిషేకం, ఆకుపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 సమయంలో శ్రీ వల్లిదేవసేనా, శ్రీవారి కల్యాణమహోత్సవంను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దైవ దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 35 ఎత్తు అడుగుల ఎత్తు గల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, 9 అడుగుల నంది విగ్రహం, 10 అడుగులు నాగుల పడగ విగ్రహాలు భక్తులను ఆకుట్టుకుంటున్నాయి.