మాజీ సర్పంచ్ గురుసిద్దప్ప టీడీపీలో చేరిక
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:01 AM
మం డలంలోని ఉడేగోళం గ్రా మ పంచాయతీకి చెం దిన మాజీ సర్పంచ్ గు రుసిద్దప్ప, వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి శనివారం చేరారు.
![మాజీ సర్పంచ్ గురుసిద్దప్ప టీడీపీలో చేరిక](https://media.andhrajyothy.com/media/2024/20240224/24rdg7_731049d4aa.jpg)
రాయదుర్గంరూరల్, ఫిబ్రవరి 24: మం డలంలోని ఉడేగోళం గ్రా మ పంచాయతీకి చెం దిన మాజీ సర్పంచ్ గు రుసిద్దప్ప, వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి శనివారం చేరారు. మా జీ మంత్రి కాలవ శ్రీని వాసులు నివాసంలో పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. గురుసిద్దప్పతో పాటు విజయేంద్ర, మరికొంతమంది పార్టీలోకి చేరారు. టీడీపీ మండల కన్వీనర్ హనుమంతు, మాజీ జెడ్పీటీసీ విజయకుమార్, టీడీపీ నాయకులు తిప్పేస్వామి, శ్రీకంఠప్ప, ఓబయ్య, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉరవకొండ: వజ్రకరూరు మండలంలోని పందికుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో పార్టీ తీర్థం పుుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన వెంకటేశులు, అంజి, నాగరాజు, వన్నూరుస్వామి, రాజు, రమే్షలకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. వీరితో పాటు 40 కుటుంబాలు పార్టీలోకి చేరారు. మండల కన్వీనర్ నూతేటి వెంకటేశులు, నాయకులు నాగేంద్ర, మండి ఎర్రిస్వామి, ధనంజయ, రామకృష్ణ, వెంకటేశులు పాల్గొన్నారు. అలాగే నింబగల్లుకు చెందిన 30 వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పయ్యావుల శ్రీనివాసుల సమక్షంలో పార్టీలోకి చేరారు. వీరన్న ఓబులేసు, వన్నూరుస్వామి, కావలి తిమ్మరాజు, దాసరి రమే్షలతో పాటు మరికొంత మందికి పార్టీ కండువాలు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకలు సిద్దప్ప, భగవాన, నూతన పాల్గొన్నారు.