మాజీ ఎంపీ జేసీ సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:13 AM
మండలంలో గురువారం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
పెద్దపప్పూరు, మార్చి 28: మండలంలో గురువారం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని ముచ్చుకోట, వ రదాయపల్లి, చిక్కేపల్లి గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్కు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. ఆ యన వెంట జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు తాతిరెడ్డి లోకనాథ్రెడ్డి, బీసీ రామకృష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి, నాగార్జునరెడ్డి, నారాయణస్వామి, చిన్న, అమరసింహ, అదెన్న, హుస్సేనపీరా, మండల తెలుగు రైతు అధ్యక్షుడు కిరణ్, నరసింహారెడ్డి, వెంకటశివారెడ్డి, జనసేన నాయకులు మహేష్, బాబు ఉన్నారు.