Share News

బలవంతంగా వైసీపీ కండువాలు వేశారు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:11 AM

ఓబుళదేవరచెరువు, మార్చి 21: తాము ఇఫ్తార్‌ విందుకు వెళితే.. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సమక్షంలో కొంతమంది వైసీపీ నాయకులు వారి పార్టీ కండువాలు వేశారని మైనార్టీలు వాపోయారు.

బలవంతంగా వైసీపీ కండువాలు వేశారు

- ఇఫ్తార్‌ విందుకు పిలిచి ఇలా చేశారంటున్న టీడీపీ కార్యకర్తలు

ఓబుళదేవరచెరువు, మార్చి 21: తాము ఇఫ్తార్‌ విందుకు వెళితే.. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సమక్షంలో కొంతమంది వైసీపీ నాయకులు వారి పార్టీ కండువాలు వేశారని మైనార్టీలు వాపోయారు. గురువారం వైసీపీ కండువాలు వేసుకున్న బీడిపల్లి మహబూబ్‌బాషా, అబ్దుల్‌ రహిమాన, ఆర్ఫీఖాన, తబ్రేజ్‌, గౌస్‌మెయిద్దీన తదితరులు వెంటనే వారు మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి ఆధ్వర్యంలో తిరిగి టీడీపీలోకి చేరారు. ఇఫ్తార్‌విందుకు ఆహ్వానించి బలవంతంగా వైసీపీ కండువాలు వేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పిట్టా ఓబులరెడ్డి , మైనార్టీ నేతలు పొగాకు షబ్బీర్‌, చికెన షానూ మాట్లాడుతూ వైసీపీ వారు చీప్‌ ట్రిక్స్‌ చేయడం మానుకోవాలన్నారు. ఇఫ్తార్‌విందుకు పిలిపించి బలవంతంగా కండువాలు వేయడం తగదన్నారు. పైగా వందమంది చేరినట్లు అసత్య ప్రచారం చేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన పిట్టా ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పిట్టా రాజారెడ్డి, తుమ్మల మహబూబ్‌బాషా, మండోజీ ఆర్ఫీఖాన, జెరిపిటి ఆంజనప్ప, సౌదీ నాగరాజు, అబ్లు, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:11 AM