వైసీపీ ప్రచారంలో ఫీల్డ్ అసిస్టెంట్
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:19 AM
కదిరి, ఏప్రి ల్ 17: వైసీపీ ఎన్నికల ప్రచారంలో తలుపుల మండలం బట్రేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఓ. వెం కటశివారెడ్డి పా ల్గొనడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కదిరి, ఏప్రి ల్ 17: వైసీపీ ఎన్నికల ప్రచారంలో తలుపుల మండలం బట్రేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఓ. వెం కటశివారెడ్డి పా ల్గొనడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పాల్గొన్నట్లు సమాచారం. మంత్రి పెద్దిరెడ్డితో పాటు ప్రచారం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై అఽధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.