Share News

అంతా రామమయం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:49 PM

శ్రీరామనవమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు.

అంతా రామమయం
లక్ష్మినగర్‌ రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ : శ్రీరామనవమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. సీతారా ములకు కల్యాణోత్సవం జరిపించడంతో పాటు పలుప్రాంతాల్లో ఉట్టికొట్టడం, ఉట్లమానుపరుష, పానకం, వడపప్పు వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జానకిరాముడి కల్యాణా న్ని కనురాలా వీక్షించి అనంత భక్తజనం పులకించిపోయింది. ఆజాద్‌నగర్‌లోని దత్తమందిరం వద్ద ధర్మకర్త డాక్టర్‌ నలుబోలు మధురాయల్‌ దంపతుల నేతృత్వం లో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం టీడీపీ అనంతపురం అర్బన ఎమ్మె ల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ హాజరై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం శ్రీరామనవమి వేడుకలతో ప్రజలు ఉత్సాహంగా సాగారు. అనంతపురంరూరల్‌, నార్పల, చెన్నేకొత్తపల్లి, శింగనమల, గార్లదిన్నె, రాప్తాడు, రామగిరి మండలాల్లో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Updated Date - Apr 17 , 2024 | 11:49 PM