Share News

వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే: టీడీపీ

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:00 AM

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి, ఇంటిగ్రేటెడ్‌ ట్రైనర్‌ ఎం ఆదినారాయణ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే: టీడీపీ

పామిడి, జనవరి 31: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి, ఇంటిగ్రేటెడ్‌ ట్రైనర్‌ ఎం ఆదినారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో గల తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి స్వగృహంలో బుధవారం యూనిట్‌, క్లస్టర్‌, పోలింగ్‌ బూత ఇనచార్జులకు ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రెండు నెలలపాటు క్షేత్రస్థాయిలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల మదిలో నిలిచిపోయేలా అవగాహన కల్పించాలన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు తెలుగుదేశం పార్టీకి ఆరోప్రాణమన్నారు. పార్టీ అభివృద్ధికి శ్రమించిన కార్యకర్తలకు టీడీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి, గౌస్‌పీరా, చెన్నవరం మహబూబ్‌బాషా, అప్పన్నగారి కుమార్‌, రామకృష్ణ, వడ్డే శివకుమార్‌, బొమ్మా మోహనకృష్ణ, గాదిలింగ, శ్రీనివాసులు, చీమల రాము, శివ, బాబా, తాజ్‌, మాధవ, దూదూ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:00 AM