Share News

వైభవంగా ఎర్రిస్వామి రథోత్సవం

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:58 PM

మండలంలోని వై.రాంపురం గ్రామంలో ఎర్రిస్వామి రథోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ఎర్రిస్వామి రథోత్సవం
రథాన్ని లాగుతున్న భక్తులు

ఉరవకొండ, మార్చి 27: మండలంలోని వై.రాంపురం గ్రామంలో ఎర్రిస్వామి రథోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు. అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేశారు. రథాన్ని ఆలయం నుంచి బొడ్రాయి వరకు లాగారు. రథంపైకి భక్తులు అరటిపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్త్‌ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:58 PM