Share News

అలరించిన భక్తిగీతాలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:11 AM

పుట్టపర్తి, మార్చి 23: సత్యసాయి విద్యార్థులు భక్తి గీతాలతో అలరించారు. పట్టణంలోని ప్రశాంతి నిలయంలో గ ల సాయికుల్వంత హాల్లో శనివారం సాయంత్రం బెంగుళూరు బృందావన క్యాంప్‌సకు చెందిన సత్యసాయి విద్యార్థులు భక్తి గీతాల ఆలాపన చేపట్టారు.

అలరించిన భక్తిగీతాలు

పుట్టపర్తి, మార్చి 23: సత్యసాయి విద్యార్థులు భక్తి గీతాలతో అలరించారు. పట్టణంలోని ప్రశాంతి నిలయంలో గ ల సాయికుల్వంత హాల్లో శనివారం సాయంత్రం బెంగుళూరు బృందావన క్యాంప్‌సకు చెందిన సత్యసాయి విద్యార్థులు భక్తి గీతాల ఆలాపన చేపట్టారు. విద్యాసంవత్సరం ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని వారు గంటపాటు భక్తి నివేదనం పేరిట ఈ కార్యక్రమం చేపట్టారు. వారు ఆలపించిన గీతాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అనంతరం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:11 AM