Share News

groundnut: విత్తన వేరుశనగకు పేర్లు నమోదు చేయండి

ABN , Publish Date - May 21 , 2024 | 12:17 AM

మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల్లో విత్తన వేరుశనగ కావలసిన రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని ఏఓ శ్రీహరినాయక్‌ సూచించారు.

groundnut: విత్తన వేరుశనగకు పేర్లు నమోదు చేయండి

  • ఆర్బీకేల సిబ్బందికి వ్యవసాయాధికారుల సూచన

తనకల్లు, మే 20: మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల్లో విత్తన వేరుశనగ కావలసిన రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని ఏఓ శ్రీహరినాయక్‌ సూచించారు. మండలకేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పేర్లు నమోదు చేయించడంతో పాటు డబ్బు కూడా చెల్లించి రసీదులు పొందాలని తెలిపారు.


ప్రతి రోజు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో సంబంఽధిత విలేజీ అగ్రికల్చర్‌, సిరికల్చర్‌, ఉద్యానవ అసిస్టెంట్లు విత్తన పంపిణీ కోసం రైతుల పేర్లు నమోదు చేయనున్నట్లు చెప్పారు. కావలసిన రైతులు తమ పట్టాదారుపాసుపుస్తకం, ఆధార్‌, సెల్‌ తీసుకెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా రైతుల పేర్లునమోదు, నగదు చెల్లింపులో సమస్యలుంటే వెంటనే 8500942088కు సప్రందించాలని సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 21 , 2024 | 12:18 AM