మునిమడుగు నుంచి ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:10 AM
ఎన్నికల సమయం తక్కువగా ఉన్నా నాయకులను, కార్యకర్తలను కలుపుకుని వెళ్తున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో బుధవారం నుంచి పెనుకొండ మండలం మునిమడుగు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ పరిశీల కుడు నరసింహరావు తెలిపారు.
నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు
పెనుకొండ టౌన, మార్చి 11 : ఎన్నికల సమయం తక్కువగా ఉన్నా నాయకులను, కార్యకర్తలను కలుపుకుని వెళ్తున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో బుధవారం నుంచి పెనుకొండ మండలం మునిమడుగు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ పరిశీల కుడు నరసింహరావు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈ ప్రచారం విషయం జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి దృష్టికి తీసుకెళ్లామని ఆయన సమ్మతి తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టూరు సూరి, మాధవనాయుడు, మావటూరు గోపాల్, త్రివేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగి మండలం గొర్రిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పది కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత కండువా వేసి స్వాగతం పలికారు.