mla kandikunta ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: కందికుంట
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:32 AM
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కదిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
![mla kandikunta ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: కందికుంట](https://media.andhrajyothy.com/media/2024/20240604/7_KDRUR_01_b7d047d940.jpg)
కదిరిఅర్బన, జూన 7: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కదిరి ఎమ్మెల్యే గా గెలుపొందిన కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
పట్టణంలో శుక్రవారం ఆయన్ను ఆర్టీసి కార్మికులు కలిసి పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. ఇందుకు కందికుంట మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి కార్మిక సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు జీవైపీ రావు, ఆర్ ఎస్ రెడ్డి, జీసీఎస్ నాయుడు, శంకరప్ప, హరికుమార్, సుఽఽధీర్, సలాంబాషా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...