Share News

JOB : స్త్రీ సాధికారతకు తొలిమెట్టు చదువు

ABN , Publish Date - May 27 , 2024 | 11:59 PM

స్ర్తీ సాధికారతకు చదువు తొలిమెట్టు అని హిందూపురంలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హరీష్‌బాబు అన్నారు. పట్టణ పరిధిలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఈసీఈ, సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 60 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ స్ర్తీల సాధికారతకు చదువు తొలిమెట్టు అని తెలిపారు.

JOB : స్త్రీ సాధికారతకు తొలిమెట్టు చదువు
ఉద్యోగ ఎంపిక పత్రాలతో విద్యార్థినులు

మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

హిందూపురం అర్బన, మే 27: స్ర్తీ సాధికారతకు చదువు తొలిమెట్టు అని హిందూపురంలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హరీష్‌బాబు అన్నారు. పట్టణ పరిధిలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఈసీఈ, సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 60 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ స్ర్తీల సాధికారతకు చదువు తొలిమెట్టు అని తెలిపారు. స్త్రీల అభ్యున్నతికి, పురోగతికి, స్వావలంబనకు ఉద్యోగం ఎంతగానో దోమదపడుతుందన్నారు. . ఈసీఈ విభాగం నుంచి 37 మంది, సివిల్‌ విభాగం నుంచి 23 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందించారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో పెనుకొండ పీఆర్‌ డివిజన ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ మురళీమోహన, కళాశాల భోధనా సిబ్బంది హరినాథ్‌బాబు, సత్యకీర్తి, పాణి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 27 , 2024 | 11:59 PM