Share News

ఏడాది తిరక్కనే ధ్వంసమైన డ్రైనేజీ

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:46 PM

మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట ప్రాంతంలో గత వర్షాలకు ప్రధాన రహదారి వరువ తెగిపోయింది.

ఏడాది తిరక్కనే ధ్వంసమైన డ్రైనేజీ
ధ్వంసమైన డ్రైనేజీ

హిందూపురం అర్బన, జనవరి 17: మున్సిపాలిటీ పరిధిలోని పూల కుంట ప్రాంతంలో గత వర్షాలకు ప్రధాన రహదారి వరువ తెగిపోయింది. దీంతో మరువ పైన వంతెన నిర్మించి పక్కనే డ్రైను ఏర్పాటు చేశారు. అయితే ఏడాది కూడా తిరక్కుండానే పూలకుంట వద్ద బుడేనసాబ్‌ బంగ్లా ఎదుటి భాగంలో హిందూపురం, లేపాక్షి ప్రధాన రహదారికి పక్కనే ఉన్న డ్రైను ధ్వంసమైంది. డ్రైను కూలి పోవడంతో ప్రమాదకరంగా మారింది. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లారంటే అందులో పడే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ కి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:46 PM