గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్లొద్దు
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:21 PM
గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్లకూడదని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ పార్టీ శ్రేణులకు సూచించారు. నగరంలోని వారి స్వగృహంలో ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రామా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
![గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్లొద్దు](https://media.andhrajyothy.com/media/2024/20240604/9_urban_1_A_aa4ce07758.jpg)
అనంతపురం అర్బన, జూన 9: గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్లకూడదని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ పార్టీ శ్రేణులకు సూచించారు. నగరంలోని వారి స్వగృహంలో ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రామా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల విజయోత్సాహంలో పార్టీ శ్రేణులంతా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఎవరూ గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్లకూడదని సూచించారు. ఘోర పరాభవం చెందిన వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగవచ్చునని, అయినా సంయమనంతో ఉండాలన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నదే టీడీపీ సిద్ధాంతం, తమ లక్ష్యం కూడా అన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.