కోడ్ను పట్టించుకోరా...?
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:26 AM
ఎన్నికల కోడ్ వచ్చి 12రోజులవు తోంది. అయినా కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.
హిందూపుం, మార్చి 28 : ఎన్నికల కోడ్ వచ్చి 12రోజులవు తోంది. అయినా కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజకీయ నాయకుల ఫొటోలు, పోస్టర్లు, హోర్డింగ్లు పబ్లిక్ ప్రదేశాల్లో ఉండకూడదని ఎన్నికల కమిషన ఆదేశాలు జారీచేసింది. అయినప్ప టికీ జిల్లా అధికారులు వాటిని అమలు చేయడంలో ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. హిందూపురం నియోజక వర్గంలో పలుచోట్ల ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫొటోలున్న స్టిక్కర్లు, వైసీపీ రంగులు ఉన్న భవనాలు దర్శనమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెల్లో అయితే జగన బొమ్మతో ఉన్న స్టిక్కర్లు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. ప్రతి పంచాయతీకి గ్రామ వార్డు సచివాలయం ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు.
గోరంట్ల: మేజర్ పంచాయతీ పరిధిలోని సిరగంవాండ్లపల్లిలో నివాస గృహాలు, పశువుల పాకలపై వైసీపీ జెండాలు ఎరుగుతుండ డంతో గ్రామానికి ఎ న్నికల కోడ్ వర్తించా అంటూ పలువురు విమర్శస్తున్నారు. షెడ్యుల్ విడుదలై 12 రోజులు గడుస్తున్నా సంబంధి తాఽధికారు లు ఏమి చేస్తున్నా రంటు న్నారు. ఇప్ప టి కైనా అధికారులు చర్యలు తీసు కోవా లని ఫొటోలు తీసి సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.