నాయకుడిని అంటూ నయవంచకుడిగా మారావు
ABN , Publish Date - Apr 15 , 2024 | 12:48 AM
నాయకుడిని అంటూ.. రాష్ట్ర ప్రజల పాలిట నయవంచకుడిగా మారావని సీఎం జనగ్పై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బాలయ్య అనస్టాపబుల్ బహిరంగ సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు.
సీఎంగా కంత్రీ పాలన చేస్తున్నావు
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో సీఎం జగనపై బాలయ్య ఫైర్
మూడు రెక్కలను ముక్కలు చేయాలని ప్రజలకు పిలుపు
గార్లదిన్నె, ఏప్రిల్ 14: నాయకుడిని అంటూ.. రాష్ట్ర ప్రజల పాలిట నయవంచకుడిగా మారావని సీఎం జనగ్పై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బాలయ్య అనస్టాపబుల్ బహిరంగ సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభలో ఆయనతో పాటు అనంతపురం లోక్సభ ఎన్డీయే అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, శింగనమల నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తనదైన శైలిలో సీఎం జగనపై విరుచుకుపడ్డారు. మడమ తిప్పనంటూ మెడలు విరిచావు.. మద్యపాన నిషేధం అంటూ నిరుపేదల రక్తం తాగుతున్నావు.. జగనన్న అంటూ జలగలా పీల్చుతున్నావు.. మామయ్య అంటూ మనోభావాలను మంటగల్పుతున్నావు.. నవరత్నాలు అంటూ నవనాడులను నలిపేశావని సెటైర్లు వేశారు. నేనున్నా అంటున్నావు.. అవును నువ్వు ఉన్నావు. నువ్వు లేకుండా ఎక్కడికి పోతావు.. పోయే సమయం దగ్గరకు వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దళితులకు అండ అంటూ వారి జీవితాలతో ఆడుకొని ప్రాణాలు తీసి దాహం తీర్చుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను పిచ్చోడిని చేసి చంపారని విమర్శించారు. జడ్జి రామకృష్ణ మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా వేధించారని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు దళితులకు శిరోముండనం చేయించాడన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతకుమార్ తన కారు డ్రైవర్ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీలకు ఎంతో ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజధాని ఉద్యమ కారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారి మెతుకులను ముద్దగా మార్చుకున్నాడన్నారు. ఇలా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అందరికీ అన్యాయం చేసిన ఘనుడు సీఎం జగన అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ల నిధులు దారి మల్లించి అందరికీ అన్యాయం చేసిన దుర్మార్గుడు జగన అంటూ నిప్పులు చెరిగారు. ఆఖరికి అక్కచెల్లెమ్మల ఆస్తుల్లో వాటాలు అడుగుతున్నావు.. వారి ఉసురుపోసుకోకు అంటూ హితవు పలికారు. సీఎంగా కంత్రీ పాలన చేస్తున్నావంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించాడన్నారు. భావితరాలకు ఇసుక దొరకనంతగా అక్రమంగా తరలించి కోట్లు దండుకున్నారన్నారు. నకిలీ మద్యంతో జే బ్రాండ్స్ ద్వారా ఆడపడుచుల తాళిబొట్లు తెంచాడని అన్నారు. సీఎం జగన మోసానికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. టీడీపీ రాయలసీమలో కృష్ణమ్మ జలాలను పరుగులు పెట్టించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ముఠాకక్షలకు వైసీపీ ఆజ్యం పోసిందని ఆరోపించారు. రాయలసీమను రక్తసీమగా మార్చిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవన్నారు. ఈ ఎన్నికల్లో మూడు రెక్కలను ముక్కలు చేసేందుకు అందరూ కలిసి రావాలన్నారు. ఎన్డీయే శక్తి ఎనలేనిదన్నారు. ఈ శక్తిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ గతంలోని అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందన్నారు. బీసీ-ఈపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. కచ్చితంగా కొనసాగిస్తామన్నారు. వైసీపీ దుష్ప్రచారం నమ్మవద్దంటూ తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ధేశిస్తాయన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంటిమడుగు శ్రీనివా్సరెడ్డి, విశాలాక్షి, రామలింగారెడ్డి, గుర్రం ఆదినారాయణ, గేటుక్రిష్ణారెడ్డి, ఆవులక్రిష్ణయ్య, ఇల్లూరు రామాంజి, వడ్డేవన్నూర్, గుత్తాబాలకృష్ణ, డేగల కృష్ణామూర్తి, నరసింహారెడ్డి, పుల్లన్న, సుంకన్న, బాబయ్య, అంజి, శీనా, గంగాధర్, గోరకాటి వెంకటేసు, జయరాం, చితంబరప్ప, చితంబరిదొర, ఎంపీటీసీలు సురేంద్ర, విశ్వనాథ్, చల్లానాగరాజు, రమణప్ప, సుధాకర్రెడ్డి, ఓబిరెడ్డి, సామాల మధు తదితరులు పాల్గొన్నారు.
బాలయ్యకు బ్రహ్మరథం
అడుగడుగునా జననీరాజనం
బహిరంగ సభలకు పోటెత్తిన జనం
అభివృద్ధి కావాలా..? అరాచకం కావాలా..?
రాక్షస రాజ్యమా..? రామరాజ్యమా..?
ఆలోచించాలని ప్రజలకు బాలయ్య విజ్ఞప్తి
జిల్లాలో రెండో రోజు కొనసాగిన స్వర్ణాంధ్ర సాకార యాత్ర
అనంతపురం ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన రోడ్ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులు పడుతూ.. బాణసంచా పేలుస్తూ .. జై బాలయ్యా అంటూ కూటమి శ్రేణులు, అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. ఇక బహిరంగ సభలకైతే జనం పోటెత్తారు. రెండో రోజు ఆదివారం శింగనమల, అనంతపురం అర్బన నియోజకవర్గాల్లో బాలయ్య స్వర్ణాంధ్ర సాకార యాత్ర సాగింది. అనంతపురం నగరం సప్తగిరి సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూటమి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్తో కలిసి బాలకృష్ణ మాట్లాడుతూ... నందమూరి తారకరామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీతర్వాత వచ్చిన ప్రభుత్వాలు తూచాతప్పకుండా అమలు చేశాయన్నారు. పేరు మార్చారే తప్పా ఏ పథకాన్ని ఆపలేదన్నారు. రెండు రూపాయిలకే కిలో బియ్యం, భూమి శిస్తు, చేనేత వస్ర్తాలు ఇలా అనేక సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అభినవ అంబేడ్కరుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యతకు సంబంధించిన విషయం అనేది ప్రజలు గమనించాలన్నారు. దోచుకొని దాచుకోవడమే జగనకు తెలిసిన అరాచకమన్నారు. దొంగకు తాళం ఇచ్చినా.. జగనకు అధికారం ఇచ్చినా ఒక్కటేనని అన్నారు. రూ.1600 కోట్ల ప్రజాధనంతో రాష్ట్రమంతా సిద్ధం హోర్డింగ్లు పెట్టిన జగన దేనికి సిద్ధమని ఆయన ప్రశ్నించారు. చెల్లికి ద్రోహం చేయడానికా..? బాబాయ్ని చంపించడానికా..? తల్లిని మోసం చేయడానికా..? అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలు తన అక్కపై అత్యాచారం చేశారని ఓ బాలుడు ప్రశిస్తే పెట్రోలు పోసి చంపడానికి సిద్ధపడిన దుర్మార్గులు అన్నారు. ఐదేళ్ల జగన పాలనలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఆ మేరకు యువతకు సమాఽధానం చెప్పడానికి నీవు సిద్ధమా జగన అని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన నిధులు ఏమయ్యాయో చెప్పేందుకు సిద్ధమా అని నిలదీశారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే అడిగే నాథుడే లేడన్నారు. కొవిడ్లో అక్రమాలు ప్రశ్నించిన దళిత డాక్టర్ సుధాకర్కు శిరోముండనం చేసి చంపేసిన దుర్మార్గులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రపంచ పటంలో ఉండేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి కావాలో..? అరాచకం కావాలో ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన రాక్షస రాజ్యం కావాలో..? చంద్రబాబు రామరాజ్యం కావాలో మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
అనంత నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తాం
ఎమ్మెల్యే అనంత కుటుంబం ఆరు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిందని, ఇక్కడ ఏం అభివృద్ధి సాధించారని బాలకృష్ణ ప్రశ్నించారు. నగరం అభివృద్ది కావాలంటే కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అనంతపురం నగరాన్ని స్మార్ట్సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. అనంత నగరశివారులోని డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. అనంత నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటుతో మట్టికరిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.