Share News

ప్రాణాలు పోతేగానీ పట్టించుకోరా..?

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:03 AM

పొలాల్లో ఎక్కడా చూసిన విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతూ యమపాశాలుగా మారా యి. మరికొన్ని చోట్ల నేలపైనే ఉన్నాయి. అధికారులకు ఎంతచెప్పినా పెడచెవినా పెడు తున్నారని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలు పోతేగానీ పట్టించుకోరా..?
నేలపైనే ఉన్న విద్యుత తీగలు

ధర్మవరంరూరల్‌, జూన 7: పొలాల్లో ఎక్కడా చూసిన విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతూ యమపాశాలుగా మారా యి. మరికొన్ని చోట్ల నేలపైనే ఉన్నాయి. అధికారులకు ఎంతచెప్పినా పెడచెవినా పెడు తున్నారని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో తీగలు వేలాడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత స్తంభాలు లేక కట్టెలను ఏర్పాటు చేశారు. అవి గాలికి విరిగిపోవ డంతో... నేలమీదే విద్యుత తీగలు ఉన్నాయి. ముచ్చురామి గ్రామంలో బోగే నారాయణరెడ్డి పొలంలో చేతికందె ఎత్తులో విద్యుత తీగలు ఉన్నాయి.


దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చె ప్పినా విద్యుత స్తంభం ఏర్పాటు చేయలేదని, దీంతో తానే తీగలను కట్టెల సాయంతో ఎత్తు లో ఉంచినా.. గాలికి కిందకు పడిపోతు న్నా యని ఆయన వాపోయారు. అదేవిధంగా వసంతపురం గ్రామ సమీపంలో ధర్మవరానికి వెళ్లే ప్రధాన రహ దారి పక్కన ఓ రైతు పొలంలోనూ విద్యుత తీగలు తక్కువ ఎత్తు లో ఉన్నాయి. రాత్రి పూట పొలాల్లోకి వెళ్లాలం టేనే భయంగా ఉందని ఆ రైతులు వాపోతు న్నారు. పొరపాటుగా కొత్తవారు తోటల వద్ద కు వస్తే ఆ తీగల తగిలి మృత్యువాత పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. అధికారులు స్పందించి ఈ సమస్యలు పరి ష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:03 AM