Share News

చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:47 AM

బుక్కపట్నం, జనవరి 20: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పేర్కొన్నారు.

చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

బుక్కపట్నం, జనవరి 20: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని బీసీ కాలనీలో శనివారం ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాల గరించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. చంద్రబాబు తిరిగి సీఎం అయితేనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కావున ప్రతిఒక్కరూ టీడీపీ విజయానికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు నాగరాజు, ఈశ్వరయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:47 AM