Share News

వైసీపీ ఓటమి ఖాయం: చిలకం మధు

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:35 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 12: వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

  వైసీపీ ఓటమి ఖాయం: చిలకం మధు

ధర్మవరం, ఏప్రిల్‌ 12: వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని జనసేన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు మా అధినేత పవనకల్యాణ్‌పై కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలనను పారద్రోలడానికే పవనకల్యాణ్‌ టీడీపీ,బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. ఉమ్మడిజిల్లాలోని అన్నినియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. వైసీపీని ఇంటికి సాగనంపడమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:35 AM