Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సీఎం జగనపై దళితులకు నమ్మకం లేదు

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:01 AM

సీఎం జగనను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని వారంతా టీడీపీవైపే వస్తున్నారని మాజీ మంత్రి పరిటాలసునీత అన్నారు.

సీఎం జగనపై దళితులకు నమ్మకం లేదు
పరిటాలసునీత సమక్షంలో టీడీపీలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు

మాజీ మంత్రి పరిటాల సునీత

రామగిరి, మార్చి 2: సీఎం జగనను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని వారంతా టీడీపీవైపే వస్తున్నారని మాజీ మంత్రి పరిటాలసునీత అన్నారు. శనివారం వెంకటాపురం గ్రామంలో పేరూరు పంచాయతీ కు రుకుంట్ల కాలనీకి చెందిన వైసీపీ దళిత నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. సాయి, నారాయణ, ప్రకాశ, హరి, మాధవయ్య, మూర్తి, శి వ, గంగరత్నమ్మ, పెద్దక్క, ఆంజనేయులు వారి కుటుంబసభ్యులతో రాగా వారందరికీ పరిటాలసునీత పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ... వైసీపీలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారికి ఏ మాత్రం ప్రాధాన్యత లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:01 AM