డీ చెర్లోపల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:41 AM
బత్తలపల్లి ఫిబ్రవరి 26: మండలంలోని డీ చెర్లోపల్లి పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.
![డీ చెర్లోపల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బత్తలపల్లి ఫిబ్రవరి 26: మండలంలోని డీ చెర్లోపల్లి పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటితో పాటు పొలాల్లోకి సైతం వెళ్లి అక్కడి కూలీలకు మినీమేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాసులు, గంటాపురం జగ్గు, తాళ్లూరి సతీష్, సాంబ, చితంబర్రెడ్డి, కృష్ణయ్య, రవి, నారాయణస్వామి తదితరులు పాలొన్నారు.