Share News

ROAD : మట్టితో కప్పి వదిలేశారు

ABN , Publish Date - May 26 , 2024 | 12:05 AM

త్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డు మధ్యలో మున్సిపల్‌ అధికారులు గుంతను తవ్వి, తాత్కాలికంగా మట్టి, రాళ్లతో కప్పిం వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం నుంచి లేపాక్షికి వెళ్లే ప్రధాన రహదారి శ్రీకంఠపురం అయ్యప్ప ఆలయం ఉంది. ఆలయం ఎదుటి భాగంలో తాగునీటి పైప్‌లైను లీకేజీ ఉందంటూ మునిసిపల్‌ సిబ్బంది నేషనల్‌ హైవే వారి తో అనుమతి తీసుకొని నడి రోడ్డులో పెద్ద గుంత తవ్వారు. పైప్‌ లీకేజీని అరిక ట్టారు. అయితే గుంతను తవ్విన ప్రాంతంలో కంకర, తారు వేసి రోడ్డు మరమ్మ తులు చేయాల్సి ఉంది.

ROAD : మట్టితో కప్పి వదిలేశారు
Lepakshi road which was dug in the middle and temporarily closed

హిందూపురం అర్బన, మే 25: నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డు మధ్యలో మున్సిపల్‌ అధికారులు గుంతను తవ్వి, తాత్కాలికంగా మట్టి, రాళ్లతో కప్పిం వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం నుంచి లేపాక్షికి వెళ్లే ప్రధాన రహదారి శ్రీకంఠపురం అయ్యప్ప ఆలయం ఉంది.


ఆలయం ఎదుటి భాగంలో తాగునీటి పైప్‌లైను లీకేజీ ఉందంటూ మునిసిపల్‌ సిబ్బంది నేషనల్‌ హైవే వారి తో అనుమతి తీసుకొని నడి రోడ్డులో పెద్ద గుంత తవ్వారు. పైప్‌ లీకేజీని అరిక ట్టారు. అయితే గుంతను తవ్విన ప్రాంతంలో కంకర, తారు వేసి రోడ్డు మరమ్మ తులు చేయాల్సి ఉంది. అయితే గుంతను మట్టితో కప్పి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు మట్టి కుప్పను తప్పించబోయి ప్రమాదాబారిన పడుతున్నారు. ఇంకొంత మంది పొరపాటున వాహనాన్ని వచ్చి మట్టి కుప్పను ఎక్కించి జారి పడుతున్నారు. దీంతో ఆ ప్రాంతం తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక వర్షం వస్తే బురదమయంగా మారి, వాహనాలు జారిపడటం ఖాయం. ఇప్పటికైనా మునిసిపల్‌ సిబ్బంది స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 12:05 AM