అవార్డులందుకున్న అనంత కళాకారులు
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:50 PM
తెలుగు నాటకరంగ కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లలితకళా పరిషత ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం అవార్డులకు ఎంపికైన కళాకారులకు అవార్డులు అందజేశారు.
![అవార్డులందుకున్న అనంత కళాకారులు](https://media.andhrajyothy.com/media/2024/20240413/_cdeac6fd9e.jpg)
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 17: తెలుగు నాటకరంగ కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లలితకళా పరిషత ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం అవార్డులకు ఎంపికైన కళాకారులకు అవార్డులు అందజేశారు. బుధవారం సాయంత్రం పరిషత ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిషత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట సుబ్బయ్య, గాజుల పద్మజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగస్థల కళాకారులు కేశప్ప నాయుడు, రామాంజినేయులు, ఆనంద్, దయానంద్, ఉంగరాల శ్రీనివాసులు, రాధారాణి, సత్యనారాయణబాబు, కృష్ణంరెడ్డిపల్లి నారాయణస్వామికి కందుకూరి వీరేశలింగం అవార్డులను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సంగాల నారాయణస్వామి, పతికి రమేష్ నారాయణ, అస్లాం బాషా, లోకేష్ పాల్గొన్నారు.