Share News

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశానికి కౌన్సెలింగ్‌

ABN , Publish Date - May 23 , 2024 | 11:23 PM

ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ సాంఘిక సంక్షేమ డా.బిఆర్‌. అంబేద్కర్‌ గురుకులాల్లో బాలికల కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశానికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశానికి కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థినులు

అనంతపురంరూరల్‌, మే 23: ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ సాంఘిక సంక్షేమ డా.బిఆర్‌. అంబేద్కర్‌ గురుకులాల్లో బాలికల కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశానికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. గురువారం మండ లంలోని కురుగుంటలోని డా.బిఆర్‌.అంబేద్కర్‌ కళాశాలలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని 13 బాలికల కళాశాలల్లో 295 ఖాళీలకు 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్‌ చేపట్టారు. విద్యార్థుల సర్టిఫికెట్లను డీసీఓ మురళీ కృష్ణ పరిశీలించి.. కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టారు. మార్కుల ఆధారంగా విద్యార్థినుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కురుగుంట కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత, ఇతర కళాశాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:23 PM