Share News

అధికారులకు బినామీగా కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:56 PM

శ్రీరామ్‌రెడ్డి వాటర్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి అధికారులకు బినామీగా వ్యవహరిస్తున్నాడని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ఆరోపించారు.

అధికారులకు బినామీగా కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి
ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఓబులు, కార్మికులు

కళ్యాణదుర్గంరూరల్‌, మార్చి 12: శ్రీరామ్‌రెడ్డి వాటర్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి అధికారులకు బినామీగా వ్యవహరిస్తున్నాడని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ఆరోపించారు. మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ సుధాకర్‌ రెడ్డి కాంట్రాక్టర్‌ కాదని ఆయనకు ఎక్కడ కూడా పనిచేసిన అనుభవం లేదన్నారు. అధికారులకు బినామీగా వ్యవహరిస్తూ శ్రీరామి రెడ్డి నీటి పథకం కార్మికులకు జీతాల్లో కోతలు విధించడం దుర్మార్గమన్నారు. రూ.16500 జీతం అనైతికంగా ప్రవర్తిస్తూ రూ.3 వేలు కార్మికుల జీతాల్లో కోత విధించడం వారి పొట్టకొట్టడమే అన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Mar 12 , 2024 | 11:56 PM