టెన్త జిల్లా టాపర్కి అభినందన
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:15 AM
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన ప్రణతిని శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం సుబ్బారెడ్డి, ఇతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు
అనంతపురం విద్య, ఏప్రిల్ 25 : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన ప్రణతిని శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం సుబ్బారెడ్డి, ఇతర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. గురువారం హౌసింగ్ బోర్డులోని శ్రీచైతన్య స్కూల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఏజీఎం సుబ్బారెడ్డి, విద్యార్థులతో కలసి కేక్ కట్ చేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ప్రణతి, కీర్తన, తన్విత, శ్రీజరాయల్, నిహా రిక, పూజిత, నవ్యశ్రీ, నందిని, రాజ్యశ్రీ, చిన్మయి, చరిత, కీర్తిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఇలాగే ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సమీనాఖాన, వైస్ ప్రిన్సిపాల్ శమీనా, అఝడమిక్ కోఆర్డినేటర్ నాగభూషణం, డీన సత్యనారాయణ, చంద్రమోహన, రజియా పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...