CELEBRATIONS : మూడోసారి మోదీ ప్రధాని కావడంతో సంబరాలు
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:12 AM
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కేక్కట్చేసి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు. మొదటి సంతకం చేసి దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకు నగదును వారి ఖాతాల్లో జమచేసినందుకు నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
![CELEBRATIONS : మూడోసారి మోదీ ప్రధాని కావడంతో సంబరాలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/10mdk3_b9f146151a.jpg)
మడకశిరటౌన, జూన 10: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కేక్కట్చేసి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు. మొదటి సంతకం చేసి దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకు నగదును వారి ఖాతాల్లో జమచేసినందుకు నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో రాయలసీమ కి సాన మోర్చా ఇనఛార్జి చంద్రశేఖర్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ హనుమం తరాయప్ప, టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీ నా రాయణతో పాటు పలువురు బీజేపీ, టీడీ పీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రొళ్ల: నరేంద్రమోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రొళ్ల మండలంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకు లు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. కేక్ కట్చేసి, బాణ సంచా పే ల్చారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకు న్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముద్దరాజు, బద్రినాయక్, ఆనంద్నాయక్, రామయ్యగౌడ్, పట్టాభిరామ్, టీడీపీ కన్వీనర్ దాసిరెడ్డి, జనసేన కన్వీనర్ రంగస్వామి, ఉమేష్, దాసప్ప, రమేష్, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి, దాసప్ప, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....