తాగునీటి కోసం మహిళల ఆందోళన
ABN , Publish Date - Mar 27 , 2024 | 11:56 PM
పట్టణంలోని పాతపేటలోని 8వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
ఉరవకొండ, మార్చి 27: పట్టణంలోని పాతపేటలోని 8వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నెలరోజులుగా నీరు రావడం లేదన్నారు. తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కనీసం తాగడానికి కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పక్క వీధుల్లోకి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.