సాఫ్ట్బాల్ క్రీడాకారులకు ముగిసిన శిక్షణ
ABN , Publish Date - May 12 , 2024 | 12:48 AM
బెంగుళూరులో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అంతర్ విశ్వవిద్యాలయాల సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొనే ఎస్కే యూనివర్శిటీ జట్టుకు వారం రోజులుగా స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శిక్షణ శనివారంతో ముగి సిందని ఏపీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన సీఈఓ వెంకటేశులు తెలిపారు

అనంతపురం క్లాక్టవర్ : బెంగుళూరులో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే జాతీయ అంతర్ విశ్వవిద్యాలయాల సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొనే ఎస్కే యూనివర్శిటీ జట్టుకు వారం రోజులుగా స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శిక్షణ శనివారంతో ముగి సిందని ఏపీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన సీఈఓ వెంకటేశులు తెలిపారు.
ఆ జట్టులో యశ్వంత, వినయ్కుమార్, సింహాద్రి, లక్ష్మీకల్యాన, చిన్న, హేమేంద్రనాథ్, వినోద్, శివకుమార్, నాగూర్వలీ, చిన్నమస్తాన బాబా, రాంబాబు,వరుణ్, వంశీ, కిషోర్బాబు ఉన్నారన్నారు. వీరికి ఎస్కేయూ వీసీ మస్తానరెడ్డి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ శ్రీనివాసన శనివారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జట్టు మేనేజర్, కృష్ణారెడ్డి, హెడ్కోచ వెంకటేశులు, కోచ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.